15, ఆగస్టు 2013, గురువారం

"మనసు పలికే వేళ" పాటల తోటలోకి ఆహ్వానం

      నేను రాసిన పాటల సిడి ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభప్రాంగణంలో ఈ సోమవారం 19/8/13 సాయంత్రం 6:00 గంటలకు ప్రారంభం కానున్నది. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని సిడిని ఆవిష్కరిస్తారు. ప్రముఖ గాయకులు డాక్టర్ స్ పి బాలు, సునీత, రమణ, కారుణ్య గానం చేసిన ఈ పాటల తోటలోకి మీకందరకూ సాదర ఆహ్వానం.


2, మే 2013, గురువారం

చిటపట చినుకులు,

                  1
జగతి నడచి పోతున్నది యుగాలుగా
నడుస్తున్నాము నువ్వు నేను చెరిసగాలుగా
మన సంస్కృతీ సాంప్రదాయాలు ఏమయ్యాయో
మనుషులు మారి పోతున్నారు మృగాలుగా
                2
మనసు బండరాయి
బ్రతుకు ఎండమావి
ఎదరంతా నిసిరేయి
ఈ నడక ఎవరి కోసమోయి
               3
అన్నం తినడానికి నీకు దొరకదు సమయం
అందరిని పలకరించడానికి లేదు సమయం
నీకోసం మిగిలి లేదా ఒక్క టైనా ఒక నిముషం
అసలు నువ్వు ఎందుకు పుట్టావో నాకు సంశయం
                 4
ఎన్ని చెప్పినా ఈ లోకం మారదు  
ఎంత  తిన్నా ఈ ఆకలి తీరదు
ఏ మత్తుమందు ఈ రాత్రి  అరగించిందో
రేయి తెల్లవారదు  ఈ దాహం చల్లారదు
                5
వయసు పెరిగిన కొద్ది చూపు మందగిస్తుంది
ఎడము పెరిగిన కొద్ది రూపు అందగిస్తుంది
ఏ గమ్యం లేకుంటే బ్రతుకు బద్ధకిస్తుంది
నిలిచి పోరాడావా విజయం వద్ద కొస్తుంది

28, ఏప్రిల్ 2013, ఆదివారం

కవి సమ్మేళనం

కవి సమ్మేళనం
అదొక సాహిత్య సభ
కవులు రచయితల కోలాహలం
సంకుల సమరానికి సన్నద్ధ మైనట్టుంది
అక్కడి వాతావరణం
అందరి చేతుల్లో కవితాయుధాలు
ప్రతి ఒక్కరి హృదయాల్లో వైషమ్యాలు ఈ ర్ష్యా ద్వేషాలు
 పేజీల కొద్ది కవితలు చదవాలని పోటా పోటీలు
ఎవరి కవిత వారు చదివి అదే పోతగా పయనాలు

 వేదిక పైన ఉన్న వారు మాత్రం దాతల పొగడ్తల్లో
వారు,  వారి కోసం ఏర్పాటు చేసుకున్న వేదిక అది
తమ   కీర్తిని కవులంతా  గానం చెయ్యాలని
ఏర్పాటు చేసుకున్న సభా మందిర మది
 కవులు కవితలు కాదని పాఠాలు చదివారు
వార్తా పత్రికల లోని విషయాలు వల్లించారు

 ఫోటోలు వీడియోలు జాతర ముగిసింది
ఇదంతా హుళక్కి అని కళామతల్లి పెదవి విరిచింది
ఆహుతులైన శ్రోతల హృదయం లో
ఇక ఈ సభలు బహిష్కరించి తీరాలని
ఒక మహత్తరమైన నిర్ణయం మెరిసింది