4, జూన్ 2016, శనివారం

అజ్ఞానం 

ఏ తల్లి పాడేను జోల,  ఏ  తండ్రి వూపేను డోల
ఎవరికీ నీవు కావాలి , ఎవరికీ నీ మీద జాలి ‘’
కొందరు తెలుగు భాష గురించి 
ఆందోళన చెందుతుంటే ఈ పాట గుర్తొచ్చింది
ఆంధ్రప్రదేశ్ ను ఆంగ్ల ప్రదేశ్ గా మారుస్తున్న 
మన అధినాయకుల కర్తవ్య దీక్ష కట్టెదుట కనిపించింది
ఎక్కడో తమిళనాడు హోసురులో 
తెలుగుకు ద్రోహం జరిగిందని గోల చేస్తుంటే
ఇక్కడ తెలుగు నేలపైన ఏ ఒక్కరికి పట్టని 
ఆ విషయం విస్మయం కలిగించింది
నానాటికి దిగజారుతున్న విలువలకు మూలకారణం 
భాషాసంస్కృతుల విధ్వంసమేనని చెప్పాలనిపించింది
ఎన్ని చెప్పినా అరిచి గీ పెట్టినా పట్టనట్టున్న 
ఈ తెలుగు జాతిని చూచి చెవిటి ముందు శంఖమని బుద్దొచ్చింది
ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు 
అన్నారు కదా  అనుభవైక వేద్యులు అదే నిజమనిపించింది
ఎబ్బే ఏమిటో ఎవరూ  అర్ధం చెసుకొరూ -=========

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి