అజ్ఞానం
ఏ తల్లి పాడేను జోల, ఏ తండ్రి వూపేను డోల
ఎవరికీ నీవు కావాలి , ఎవరికీ నీ మీద జాలి ‘’
కొందరు తెలుగు భాష గురించి
ఆందోళన చెందుతుంటే ఈ పాట
గుర్తొచ్చింది
ఆంధ్రప్రదేశ్ ను ఆంగ్ల ప్రదేశ్ గా మారుస్తున్న
మన అధినాయకుల
కర్తవ్య దీక్ష కట్టెదుట కనిపించింది
ఎక్కడో తమిళనాడు హోసురులో
తెలుగుకు ద్రోహం జరిగిందని గోల
చేస్తుంటే
ఇక్కడ తెలుగు నేలపైన ఏ ఒక్కరికి పట్టని
ఆ విషయం విస్మయం
కలిగించింది
నానాటికి దిగజారుతున్న విలువలకు మూలకారణం
భాషాసంస్కృతుల
విధ్వంసమేనని చెప్పాలనిపించింది
ఎన్ని చెప్పినా అరిచి గీ పెట్టినా పట్టనట్టున్న
ఈ తెలుగు
జాతిని చూచి చెవిటి ముందు శంఖమని బుద్దొచ్చింది
ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు
అన్నారు కదా అనుభవైక వేద్యులు అదే నిజమనిపించింది
ఎబ్బే ఏమిటో ఎవరూ అర్ధం చెసుకొరూ -=========
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి