15, నవంబర్ 2012, గురువారం

ఆరడుగుల నేల ఆహ్వానించిన వేళ

నేను చూసాను
తెల్లవారక ముందే నురగలు కక్కుకుంటూ పరుగులు తీస్తున్న జనాన్ని
ఆ పరుగులు  ఆగక ముందే గుండె ఆగి పోయిన దృశ్యాన్ని
నేను చూసాను
ప్రతి మనిషి తోటి మనిషిని కరకర నమిలేస్తున్న సన్నివేశాన్ని
అనుబంధాలు మానవ సంబంధాలు మాయమౌతున్న సందర్భాన్ని
నేను చూసాను
పాశ్చాత్య   మోజులో పడి  అంతరించి పోతున్న మన గొప్ప సంస్కృతిని
మసక బారి పోతున్న మనజాతి జాతకాన్ని
 గమనించాను
మమతా సమతా గీతాలు దగ్ధమై పోతున్న లోకాన్ని
మానవత ధ్వంసమై పోతున్న కాలాన్ని
మనిషి అంతర్ధానమై పోతున్న సత్యాన్ని

అనుసరించాను   సినారే విశ్వంభర కావ్యాన్ని
అనుకరించాను శ్రీ శ్రీ మహాప్రస్థాన గీతాన్ని
అవలోకించాను తిలక్ అమృతం కురిసిన రాత్రిని

మీ ముందుకు  వచ్చాను ఈ అసుర సంధ్య   వేళ 
''ఆరడుగుల నే ల ఆహ్వానించిన వేళ '' గా 

నా రచనలలో నన్ను నేను చూసుకుంటాను 
నన్ను చూస్తే నాకు దిగులు  ఎందుకిలా చెడి పోయానా అని
ఊరంతా ఒకదారి ఉలిపి కట్టే దో  దారి అనుకుంటారేమో అంతా

''ఎంత సంపాదించినా కూ టి కే  ఎన్నాళ్ళు బతికినా కా టి కే ''
''ఒరిగిపోయినా తన కంఠం నలుగురు మెచ్చేదే జీవితం
ప్రలోభాలు పైబడినా నీతి కి పడి చచ్చేదే జీవితం'' - సినారే
లంచాలు ఒక్కటే అవినీతి కాదు నీతి రీతి తప్పిన ప్రతి పని అవినీతే
ఎవరూ తను చేస్తున్నది అవినీతి అనుకోవడం లేదు ఈ రోజుల్లో ''
ఇలాంటి వాక్యాలు సన్నివేశాలు నన్ను ఈ రచనకు   పురి కొ ల్పాయి

 (ఆరడుగుల నేల ఆహ్వానించిన వేళ -- ఈ రోజు ఒంగోలు లో నా కావ్యావిష్కరణ సందర్భంగా )
ఆవిష్కరణ -- జస్టిస్ శేషశయనా రెడ్డి గారు
స్వీకారం ---జస్టిస్ పల్లేటి లక్ష్మణ రెడ్డి గారు

నా ఈ కావ్యం  'ప్రచురణలు' లో చూడండి 

2 కామెంట్‌లు: