28, ఏప్రిల్ 2012, శనివారం

ఒక మాట చెప్పనా!

ప్రజల నోళ్ళు కొట్టి ప్రజా స్వామ్యాన్ని పాతిపెట్టి ,,
గజదొంగలీనాడు  రాజులై  దొంగలై రాజ్యమేలుతున్నారు ..తిలక్

అప్పు చేసే వారు ధన్యులు ................
ఇచ్చే వారు జీవన సంగ్రామంలో అభిమన్యులు

నువ్వన్నావు.. నావి మీన నేత్రాలని   ..
అందుకేనా ఈదడానికి  కన్నీళ్ళు ఇచ్చి వెళ్లావు

ఎన్నటికి నిను వీడననే బాసను ,
 నీ పెదవి నా పెదవిపై చేసెను

ఏం చెబ్తున్నావని కాదు -
ఎంత అందంగా చెబ్తున్నావని -
ఎంత రసం అనుభవింప జేస్తున్నావని

నిజమైన కళ  ఆత్మని సంస్కరిస్తుంది -
ఆ సంస్కారం కంటికి కనబడదు 

(ఇవి నేను చదివినవి  తెలుసుకొన్నవి ---.ఆ కవులకు ధన్యవాదాలతో )

1 కామెంట్‌: