30, అక్టోబర్ 2017, సోమవారం

నాలో నేను_ నాతో నేను ==నా రాబోయే కావ్యం (ముందు మాట)
ఎర్రన జన్మించిన నేలలో మొలకెత్తాను
కావలి జవహర్ భారతి కళాశాలలో కవిగా ఆవిర్భవించాను
న్యాయశాఖలో ఉద్యోగించాను పదేళ్ళు న్యాయమూర్తి పీఠం అధిష్టించాను
ప్రణయకవిగా గీత రచయితగా కొన్ని కావ్యాలకు శ్రీకారం చుట్టాను
'పుప్పొడి రాలిన చప్పుడు' విన్నాను
'కోయిలని రా 'రమ్మన్నాను
'ఎచటికోయి నీ పయనం' అని మనిషిని నిలదీసాను
'కిలికించితాలు' 'మువ్వలవేణువులు' రవళించాను
''చినుకుల'లో తడిసాను
ఊహల గుసగుసలు' విన్నాను వినిపించాను
'నిన్ను నీవు తెలుసుకో' అని హెచ్చరించాను
విధి వక్రించిన వేళ 'నువ్వులేను నేను ' స్మృతి కావ్య మైనాను
'ఆరడుగుల నేల ఆహ్వానం'' అందరిని వినమన్నాను
'మనసు పలికిన వేళ' మౌన రాగాన్నై నా గీతాలు
బాలు సునీతల గళంలో రవళించాను
నా కవితలలోని ' ప్రణయ తత్త్వం 'విశ్వవిద్యాలయంలో భద్రపరిచాను
నిన్ననే
నా 'గుండె గోడు' విన్నవిం చు కున్నాను
ప్రతి మనిషిని' నువ్వు మనిషివా' అని ప్రశ్నించాను
'కాలం సాక్షిగా'' కొన్ని నిజాలు చెప్పాను
'ఆలాపనలు సల్లాపములు' , 'చిలిపి సరాగాలు' ,
'అపురూపాలు' రాసి పోసి ప్రణ'యనాదం చేశాను
నేను ప్రణయాన్ని ప్రసూనాన్ని ప్రభాతాన్ని ప్రజాకవిని

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి