30, అక్టోబర్ 2017, సోమవారం

ఏ తల్లి పాడేను జోల, ఏ తండ్రి వూపేను డోల
ఎవరికీ నీవు కావాలి , ఎవ రికీ నీ మీద జాలి ‘’
తెలుగు నేలపై అన్ని పాఠశాలల లో
ఇకనుంచి ఆంగ్లభాష బోధన--- తెలుగుకు ఉద్వాసన 
అని వచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులు చూచినాక కూడా
ఎవరూ ఎలుగెత్తకుంటే
ఏ ఒక్కరూ తెలుగు భాష గురించి
ఆందోళన చెందకుంటే ఈ పాట గుర్తొచ్చింది
ఆంధ్రప్రదేశ్ ను ఆంగ్ల ప్రదేశ్ గా మారుస్తున్న
మన అధినాయకుల కర్తవ్య దీక్ష కట్టెదుట కనిపించింది
నానాటికి దిగజారుతున్న విలువలకు మూలకారణం
భాషాసంస్కృతుల విధ్వంసమేనని చెప్పాలనిపించింది
ఎన్ని చెప్పినా అరిచి గీ పెట్టినా పట్టనట్టున్న
ఈ తెలుగు జాతిని చూచి చెవిటి ముందు శంఖమని బుద్దొచ్చింది
ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు అన్నారు కదా అనుభవైక వేద్యులు
అదే నిజమనిపించింది
భాష అంతరిస్తే జాతి అంతరిస్తుందని
మానవత మటుమాయమౌతుందని,
మనిషిలోని ఆర్ద్రత ఇగిరిపోతుందని
ఎంత చెప్పినా -ఎబ్బే ఏమిటో
ఎవరూ అర్ధం చెసుకోరూ..
ఒక్కరైనా నిరసన ప్రకటించరూ -------

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి